Acts 27
"పౌలు రోమాకు ప్రయాణము - క్రేతుకు వెళ్లుట మేము ఓడ యెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమైనప్పుడు, వారు పౌలును మరి కొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి."
ఆసియ దరి వెంబడి నున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడ నెక్కి మేము బయలుదేరితిమి; మాసిదోనీయుడును థెస్సలోనీక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడ నుండెను.
"మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి, పౌలు మీద దయగా నుండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను."
"అక్కడ నుండి బయలు దేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున, కుప్ర చాటున ఓడ నడిపించితిమి."
మరియు కిలికియకును పంపూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో నున్న మూరకు చేరితిమి.
అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను.
"అనేక దినములు మెల్లగా నడచి, ఎంతో కష్టపడి క్నీదుకు యెదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్య కున్నందున, క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి."
"బహు కష్టపడి దాని దాటి, మంచి రేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసైయ పట్టణముండెను."
చాలకాలమైన తరువాత ఉపవాస దినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమైయుండెను.
"అప్పుడు పౌలు - అయ్యలారా, ఈ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే గాక మన ప్రాణములకు కూడ హానియు బహునష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను."
అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.
మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడ నుండి బయలుదేరి ఒకవేళ శక్యమైతే ఫీనిక్సునకు చేరి అక్కడ శీతకాలము గపవలెనని ఎక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైఋతి వాయవ్య దిక్కుల తట్టున ఉన్న క్రేతు రేవై యున్నది.
మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు దరిని ఓడ నడిపించిరి.
కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరెను.
దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి.
తరువాత కౌద అనబడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను.
"దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తిప్పమీద పడుదుమేమోయని భయపడి, ఓడ చాపలు దింపి వేసి కొట్టుకొని పోయిరి."
మిక్కిలి పెద్దగాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.
మూడవ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసిరి.
కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమని ఆశ బొత్తిగ పోయెను.
"వారు బహుకాలము భోజనము లేక యున్నందున పౌలు వారి మధ్యను నిలిచి - అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడు హానియు నష్టమును కలిగి యుండెడిది కాదు."
ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకే గాని మీలో ఎవరి ప్రాణమునకును హాని కలుగదు.
"నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గచిన రాత్రి నా యొద్ద నిలిచి - పౌలా, భయపడకుము."
నీవు కైసరు యెదుట నిలువవలసి యున్నది; ఇదిగో నీతో కూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించి యున్నాడని నాతో చెప్పెను.
"కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను."
అయినను మనము కొట్టుకొని పోయి ఏదైన ఒక ద్వీపము మీద పడవలసి యుండునని చెప్పెను.
పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్థరాత్రివేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి
"బుడుదు వేసి చూచి ఇరువది బారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంత దూరము వెళ్లిన తరువాత, మరల బుడుదు వేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి."
"అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పుదుమేమోయని భయపడి, వారు ఓడ అమరములో నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునాయని కాచుకొని యుండిరి."
అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి తాము అనివిలో నుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి.
అందుకు పౌలు వీరు ఓడలో నుంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను.
వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి.
తెల్లవారుచుండగా పౌలు - పదునాలుగు దినముల నుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను;
"ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెంట్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను."
"ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగెను."
అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి.
ఓడలో ఉన్న మేమందరము రెండు వందల డెబ్బది ఆరుగురము.
"వారు తిని తృప్తి పొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి."
"ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తు పట్టలేదు గాని దరి గల యొక సముద్రపు పాయను చి, సాధ్యమైన యెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలోచించిరి."
"గనుక లంగరుల త్రాళ్లు కోసి, వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెర చాప గాలి కెత్తి సరిగా దరికి నడిపించిరి గాని"
రెండు సముద్రముల ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలక యుండెను. అమరము ఆ దెబ్బకు బ్రద్ధలై పోసాగెను.
ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని
"శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు,"
"కడమ వారిలో కొందరు పలకల మీదను, కొందరు ఓడ చెక్కల మీదను పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరును తప్పించుకొని దరిచేరిరి."