Hebrews 9
పాత నిబంధనలోని పరిశుద్ధ స్ధలము క్రొత్త నిబంధన సూచనయై యున్నది మొదటి నిబంధనకైతే సేవానియమములును ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్ధలమును ఉండెను.
"ఏలాగనగా, మొదట ఒక గుడారమేర్పరచబడెను. అందులో దీపస్తంభమును, బల్లయు, దాని మీద ఉంచబడిన రొట్టెలును ఉండెను, దానికి పరిశుద్ధస్థలమని పేరు."
రెండవ తెరకు ఆవల అతిపరిశుద్ధస్థలమను గుడారముండెను.
"అందులో సువర్ణ ధూపార్తియు, అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కఱ్ఱయు, నిబంధన పలకలును ఉండెను."
దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్లపడదు.
"ఇవి ఈలాగు ఏర్పరబడినప్పుడు యాజకులు సేవచేయుచు, నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్లుదురు గాని"
"సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే, ప్రధానయాజకుడొక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడర్పించును."
"దీనిని బట్టి ఆ మొదటి గుడార మింక నిలుచుచుండగా, అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలు పరచబడ లేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు."
ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలును బలులును అర్పింపబడుచున్నవి.
"ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చు వరకు విధింపబడి, అన్నపానములతోను నానా విధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి. క్రీస్తు బల్యర్పణము యొక్క పరిశుద్ధ పరచు శక్తి"
"అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా,"
"మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను."
"ఏలయనగా, మేకలయొక్కయు, ఎడ్లయొక్కయు రక్తమును, మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదె చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన యెడల"
"నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము, నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధిచేయును."
"ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు."
మరణ శాసనమెక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యము.
ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
ఇందుచేత మొదటి నిబంధన కూడ రక్తము లేకుండ ప్రతిష్టింబడలేదు.
"ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత, ఆయన నీళ్లతోను, రక్త వర్ణము గల గొఱ్ఱెబొచ్చుతోను, హిస్సోపుతోను, కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసికొని,"
"దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు, గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను."
"అదే విధముగా గుడారము మీదను, సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను,"
"మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తము చేత శుద్ధిచేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగ చెప్పవచ్చును."
పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధిచేయబడ వలసియుండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటె శ్రేష్టమైన బలుల వలన శుద్ధిచేయబడ వలసియుండెను.
"అందువలన నిజమైన పరిశుద్ధ స్ధలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్ధలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖ మందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను."
"అంతే కాదు, ప్రధానయాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసికొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు, ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొనుటకు ప్రవేశింప లేదు."
అట్లయిన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై యొక్క సారే ప్రత్యక్ష పరచబడెను.
మనుష్యులొక్క సారే మృతి పొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
"ఆలాగుననే క్రీస్తు కూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండ రెండవ సారి ప్రత్యక్షమగును."