Romans 5
"కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము."
"మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశముగలవారమై, అందులో నిలిచి యుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము."
"అంతేకాదు - శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను"
కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము.
"ఎందుకనగా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింప బడియున్నది."
"ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తి హీనుల కొరకు చనిపోయెను."
నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును.
"అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు; ఎట్లనగా, మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను."
"కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము."
"ఏలయనగా, శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము."
అంతేకాదు; మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము.
"ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను."
ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో నుండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు.
అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడ ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను.
"అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా, ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన యెడల మరి ఎక్కువగా దేవుని కృపయు, యేసుక్రీస్తను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను."
మరియు పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను.
"మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై, ఆ ఒకని ద్వారానే యేలిన యెడల కృపా బాహుళ్యమును, నీతి దానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తను ఒకని ద్వారానే ఏలుదురు."
"కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై, మనుష్యుల కందరికి శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింప బడుటకు కారణమాయెను."
"ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడితిరో, ఆలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు."
"మరియు అపరాధము విస్తరించునట్లు, ధర్మశాస్త్రము ప్రవేశించెను."
"అయినను పాపము మరణమును ఆధారము చేసికొని ఏలాగు ఏలెనో, ఆలాగే నిత్యజీవము కలుగుటకై, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపమెక్కడ విస్తరించెనో, అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను."