Acts 10
పేతురును - కొర్నేలియును ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతియైన కొర్నేలీ అను భక్తిపరుడొకు కైసరయలో ఉండెను.
"అతడు తన ఇంటి వారందరితో కూడ దేవుని యందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు దానము చేయుచు ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయువాడు."
"పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి - కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను."
అతడు దూత వైపు తేరి చూచి భయపడి - ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత - నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి -
ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము.
అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగియున్నాడని అతనితో చెప్పెను. -
"అతనితో మాటలాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన యింట పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండు వారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి-"
వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.
మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్ధన చేయుటకు మిద్దె మీదకెక్కెను.
"అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధము చేయుచుండగా, అతడు పరవశుడై,"
"ఆకాశము తెరువబడుటయు నాలుగు చెంగులు పట్టి, దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమిమీదికి దిగి వచ్చుటయు చూచెను."
"అందులో, భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును ప్రాకు పురుగులును ఆకాశ పక్షులును యుండెను."
"అప్పుడు - పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను."
"అయితే పేతురు - వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి అపవిత్రమైనదేదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా -"
దేవుడు పవిత్రముచేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడెను.
ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను.
"పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండెనో అని తనలో తనకు ఎటు తోచకయుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు యేదని విచారించి తెలిసికొని వాకిట నిలిచి యింటి వారిని పిలిచి"
పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి.
పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ - ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకు చున్నారు.
నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడ వెళ్ళుము. నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.
పేతురు ఆ మనుష్యుల యొద్దకు దిగివచ్చి - ఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణమేమని అడిగెను.
"అందుకు వారు,- నీతిమంతుడును - దేవునికి భయపడువాడును యూదజనులందరి వలన మంచిపేరు పొందిన వాడునైన శతాధిపతియగు కొర్నేలీయను ఒక మనుష్యు డున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడెనని చెప్పిరి. అప్పుడతడు వారిని లోపలికి పిలిచి ఆతిధ్య మిచ్చెను."
మరునాడు అతడు లేచి వారితో కూడ బయలుదేరెను. యొప్పే వారైన కొందరు సహోదరులును వారితో కూడ వెళ్ళిరి.
మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.
"పేతురు లోపలికి రాగా, కొర్నేలి అతనిని ఎదుర్కొని, అతని పాదములమీద పడి నమస్కారము చేసెను."
"అందుకు పేతురు - నీవు లేచి నిలువుము, నేను కూడ నరుడనే అని అతనికి చెప్పి లేవనెత్తి,"
అతనితో మాటలాడుచు లోపలికివచ్చి అనేకులు కూడియుండుట చూచెను.
"అప్పుడతడు, అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను, అట్టి వానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేదింప దగిన వాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి యున్నాడు."
"కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పెను."
"అందుకు కొర్నేలి - నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈవేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకు నా యెదుట నిలిచి"
"కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి,"
పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను యింట దిగియున్నాడని నాతో చెప్పెను.
వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నియు వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి యున్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరచి యిట్లనెను-.
దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించియున్నాను.
ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.
యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.
యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును
"అదేదనగా, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెననునదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను."
"ఆయన యూదుల దేశమందును, యెరూషలేమునందును చేసిన వాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడ దీసి చంపిరి."
దేవుడాయనను మూడవదినమున లేపి
"ప్రజలకందరికి కాక, దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయనతో కూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను."
ఇదియునుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినువాడు ఈయనే యని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమీయవలెనని మాకు ఆజ్ఞాపించెను.
ఆయనయందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయనను గూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను. అన్యులు పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుట
"పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, అతని బోధ విన్నవారందరి మీదను పరిశుద్ధాత్మ దిగెను."
"సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడ వచ్చి విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సహితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి."
ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.
"అందుకు పేతురు, మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్ళకు ఆటంకము చేయగలడా? యని చెప్పి"
యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారతనిని వేడుకొనిరి.