Acts 18
కొరింథులో అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలు దేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను యొక యూదుని అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్లెను
యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు.
వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి కలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలిసి పని చేయుచుండిరి.
"అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను."
సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను.
"వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ రక్తము మీ తల మీదనే యుండును. మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు. నేను నిర్దోషిని; ఇక మీదట అన్యజనులయొద్దకు పోవుదునని వారితో చెప్పి,"
అక్కడ నుండి వెళ్లి దేవుని యందు భక్తి గల తీతుయు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజ మందిరమును ఆనుకొని యుండెను.
ఆ సమాజ మందిరపు అధికారియైన క్రీస్పు తన యింటి వారందరితో కూడ ప్రభువునందు విశ్వాస ముంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిస్మము పొందిరి.
"రాత్రివేళ దర్శనమందు ప్రభువు - నీవు భయపడక మాటలాడుము, మౌనముగా నుండకుము,"
"నేను నీకు తోడైయున్నాను. నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహుజన మున్నదని పౌలుతో చెప్పగా,"
అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించెను.
"గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదికి లేచి న్యాయపీఠము యెదుటకు అతనిని తీసుకొని వచ్చి,"
వీడు ధర్మశాస్త్ర మునకు వ్యతిరిక్తముగ దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి.
"పౌలు నోరు తెరచి మాటలాడు బోవుచుండగా, గల్లియోను - యూదులారా, ఇది యొక అన్యాయము గాని చెడ్ఢ నేరము గానియైన యెడల నేను మీ మాట సహనముగా వినుట న్యాయమే."
"ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులను గూర్చి విమర్శ చేయుటకు నాకు మనస్సు లేదని యూదులతో చెప్పి,"
వారిని న్యాయ పీఠము యెదుట నుండి తోలివేసెను.
అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము యెదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గూర్చియు లక్ష్యపెట్టలేదు.
"పౌలు యింకను బహు దినములక్కడ యుండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నదున కింక్రేయలో తలవెంట్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలు దేరెను. ప్రిస్కిల్ల అకుల అను వారు అతనితో కూడ వెళ్లిరి."
"వారు ఎఫెసుకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచి పెట్టి, తాను మాత్రము సమాజ మందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను."
"వారంకను కొంతకాలము ఉండుమని అతని వేడుకొనగా,"
అతడు ఒప్పక - దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.
తరువాత కైసరయ రేవులో దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి అంతియొకయకు వచ్చెను.
"అక్కడ కొంత కాలముండిన తరువాత బయలు దేరి, వరుసగా గలతీయ ప్రాంతమందును, ప్రుగడియ యందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచెను."
అలెక్సంద్రియ వాడైన అపొల్లో అను నొక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను.
"అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది, తన ఆత్మ యందు తీవ్ర పడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసుని గూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు సమాజమందిరములలో ధైర్యముగా మాటలాడనారంభించెను."
ప్రిస్కిల్ల అకులయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.
"తరువాత అతడు అకయకు పొదలచుకొన్నప్పుడు, అతనిని చేర్చుకొనవలెనని సహోదరులను ప్రోత్సాహ పరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతక్కడికి వచ్చి కృప చేత విశ్వసించిన వారికి చాల సహాయము చేసెను."
"యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంత పరచి యూదుల వాదమును బహిరంగముగాను, గట్టిగాను ఖండించుచు వచ్చెను."