Acts 20
ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలిపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలు దేరెను.
ఆ ప్రదేశములయందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను.
అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియకు వెళ్లవలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియ మీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను.
"మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును థెస్పలోనీకయులలో అరిస్తర్కును, సెకెందును, దెర్భే పట్టణస్థుడైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితో కూడ వచ్చిరి."
వీరు ముందుగా వెళ్లి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని యుండిరి.
"పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ యెక్కి ఫిలిప్పి విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అక్కడ వారి యొద్ద ఏడు దినములు గడిపడితిమి."
"ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్థరాత్రి వరకు విస్తరించి మాటలాడుచుండెను."
మేము కూడి యున్న మేడ గదిలో అనేక దీపములుండెను.
"అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢనిద్ర పోయి, పౌలు చాలసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి, మూడవ అంతస్తునుండి క్రింద పడి చనిపోయినవాడై ఎత్తబడెను."
"అంతట పౌలు క్రిందికి వెళ్లి అతని మీద పడి కౌగలించుకొని - మీరు తొందరపకుడి, అతని ప్రాణమతనిలో ఉన్నదని వారితో చెప్పెను."
"అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను."
వారు బ్రతికిన ఆ చిన్నవానిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించు కొనవలెనని అక్కడికి వెళ్లితిమి. తాను కాలినడకను వెళ్లవలెనని అత ప్రకారముగా మాకు నియమించియుండెను.
అస్సులో అతడు మాతో కలిసినప్పుడు మేమతని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి.
అక్కడి నుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి.
సాధ్యమైతే పెంతుకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫెసును దాటిపోవలెనని నిశ్చయించుకొనియుండెను.
అతడు మిలేతు నుండి ఎఫెసుకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తనయొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను -
నేను ఆసియలో కాలుపెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడచుకొంటినో మీరే ఎరుగుదురు.
"యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగు ప్రభువును సేవించు చుంటినో మీకే తెలియును."
"మరియు ప్రయోజన కరమైనదేదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని యెదుట మారుమనస్సు పొంది, మన ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాస ముంచవలెనని"
యూదులకును గ్రీసు దేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియును.
"ఇదిగో నేనిప్పుడు ఆత్మ యందు బంధింపబడినవాడనై. యెరూష లేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకేమేమి సంభవించునో తెలియదు గాని"
బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొని యున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.
"అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమించుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు."
ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని; మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియును.
కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను.
దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.
"దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులను ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు, జాగ్రత్తగా ఉండుడి."
"నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును, వారు మందను కనికరింపరు."
మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకరమాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలు దేరుదురు.
కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి.
"ఇప్పుడు దేవునికిని, ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడినవారందరిలో స్వాస్థ్యమనుగ్రహించుటకును శక్తిమంతుడు."
ఎవని వెండినైనను బంగారమైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు.
"నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును, ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును."
"మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు - పుచ్చుకొనుట కంటే యిచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు, అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను."
అతడులాగు చెప్పి మోకాళ్లాని వారందరితో ప్రార్థన చేసెను.
"అప్పుడు వారందరు చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు,"
"పౌలు మెడ మీద పడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి."