Acts 24
"అయిదు దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయవాదియు కైసరయకు వచ్చి, పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి."
పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతని మీద నేరము మోపనారంభించి ఇట్లనెను -
"మహా ఘనత వహించిన ఫేలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశమునకు సంభవించిన అనేక కీడులు తమ పరామర్శచేత దిద్దుబాటవు చున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకలస్థలములలోను పూర్ణకృతజ్ఞతతో అంగీకరించుచున్నాము."
నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేము క్లుప్తముగా చెప్పుకొను దానిని తమరు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను.
"ఈ మనుష్యుడు పీడవంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మత భేదములకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి."
మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.
తమరు విమర్శించిన యెడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.
యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి.
"అప్పుడు అధిపతి - మాటలాడుమని పౌలునకు సైగ చేయగా, అత డిట్లనెను - తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను."
యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిన నాట నుండి పన్నెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొనవచ్చును.
"దేవాలయము లోనేమి, సమాజ మందిరములలో నేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుటయైనను, జనులను గుమి గూర్చుటయైనను వారు చూడలేదు."
మరియు ఇప్పుడు వారు నా మీద మోపు నేరములను తమకు ఋజువు పరచలేరు.
"ధర్మశాస్త్రమందును, ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని"
"వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడ దేవునియుందు నిరీక్షణ యుంచి,"
వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచుచున్నానని తమరి యెదుట ఒప్పుకొనుచున్నాను.
"ఈ విధమున నేనును, దేవుని యెడలను మనుష్యుల యెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను."
కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.
"నేను శుద్ధి చేసికొనిన వాడనై ఈలాగు అప్పగించుచుండగా, వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చియుండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియ నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;"
నా మీద వారికేమైన యున్న యెడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి యుండెను.
"లేదా, నేను మహాసభ యెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమును గూర్చి నేడు వారి యెదుట విమర్శింపబడుచున్నానని"
వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైనా చెప్పవచ్చుననెను.
ఫేలిక్సు ఈ మార్గమును గూర్చి బాగుగా యెరిగిన వాడై - సహస్రాధిపతి యైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొనందునని చెప్పి విమర్శ నిలుపుచేసెను.
"మరియు అతని విడిగా కావలిలో నుంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంక పరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను."
"కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతో కూడ వచ్చి, పౌలును పిలిపించి, క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను."
"అప్పుడతడు నీతిని గూర్చియు, ఆశాని గ్రహమును గూర్చియు, రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి - ఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను."
"తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను."
"రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదుల చేత మంచివాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను."