:

Acts 3

1

పగలు మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా;

2

పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారము నొద్ద ఉంచుచు వచ్చిరి.

3

"పేతురును, యోహానును, దేవాలయములో ప్రవేశింపబోవు చున్నప్పుడు వారు చూచి బిక్షమడుగగా,"

4

పేతురును యోహానును వానిని తేరి చూచి - మా తట్టు చూడుమనిరి.

5

వాడు వారి యొద్ద ఏమైనను దొరకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.

6

"అంతట పేతురు - వెండి బంగారములు నా యొద్ద లేవుగాని, నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి"

7

వాని కుడిచెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలును బలము పొందెను.

8

వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడ దేవాలయము లోనికి వెళ్ళెను.

9

"వాడు నడచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి,"

10

శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద బిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.

11

వాడు పేతురును యెహానును పట్టుకొని యుండగా ప్రజలందరు విస్మయమొంది సొలొమోను మంటపములో ఉన్నవారి యొద్దకు గుంపుగా పరుగెత్తి వచ్చిరి.

12

"పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను- ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తిచేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు."

13

"అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరచియున్నాడు. మీరాయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని యెదుట ఆయనను నిరాకరించితిరి."

14

"మీరు పరిశుద్ధుడను, నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి."

15

"మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము."

16

ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీయందరి యెదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను.

17

"సహోదరులారా, మీరును, మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును."

18

అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.

19

"ప్రభువు సముఖమునుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును,"

20

"మీ కొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును, మీ పాపములు తుడిచి వేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి."

21

అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియైయుండుట ఆవశ్యకము.

22

మోషే ఇట్లనెను- ప్రభువైన దేవుడు నావంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.

23

ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో నుండకుండ సర్వనాశన మగుననెను.

24

మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమును గూర్చి ప్రకటించిరి.

25

"ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోకవంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులైయున్నారు."

26

దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్ళించుట వలన మిమ్మునాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను.

Link: