Acts 5
అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.
భార్య యెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదముల యొద్ద పెట్టెను.
"అప్పుడు పేతురు - అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను?"
"అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా? అమ్మిన పిమ్మట అది నీ వశమైయుండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుష్యులతో కాదు, దేవునితోనే అబద్దమాడితివని వానితో చెప్పెను."
అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికిని మిగుల భయము కలిగెను.
అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.
ఇంచుమించు మూడుగంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను.
అప్పుడు పేతురు - మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె - అవును - ఇంతకే అని చెప్పెను.
"అందుకు పేతురు - ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే యున్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను."
వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసికొని పోయి అమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి.
సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికిని మిగుల భయము కలిగెను.
ప్రజల మధ్య అనేకమైన సూచకక్రియలను మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏక మనస్కులై సొలొమోను మంటపములో నుండిరి;
కడమ వారిలో ఎవడును వారితో కలిసికొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి.
"పురుషులును, స్త్రీలును అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి."
"అందుచేత పేతురు వచ్చుచుండగా, జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను, పరుపుల మీదను వారిని ఉంచిరి."
మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణములనున్న జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.
"ప్రధాన యాజకుడును అతనితో కూడ ఉన్నవారును అనగా సద్దూకయ్యులనబడు వారును లేచి మత్సరముతో నిండుకొని,"
అపొస్తలులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో నుంచిరి.
"అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి"
ఈ జీవమును గూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.
"వారామాట విని తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడ ఉన్నవారును వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి - వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి."
"బంట్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి,"
"చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలి వారు తలుపుల ముందర నిలిచియుండుటకు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలిపిరి."
అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులును ఆ మాటలు విని - ఇది ఏమగునో అని వారి విషయమై ఎటు తోచకయుండిరి.
"అప్పుడు ఒకడు వచ్చి - ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా,"
అధిపతి బంట్రౌతులతో కూడ పోయి ప్రజలు రాళ్ళతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారము చేయకయే వారిని తీసుకునివచ్చెను.
"వారిని తీసుకొని వచ్చి వారిని సభలో నిలువబెట్టగా,"
ప్రధానయాజకుడు వారిని చూచి - మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారనెను.
"అందుకు పేతురును, అపొస్తలులును - మనుష్యులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా?"
మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.
"ఇశ్రాయేలీయులకు మారుమనస్సును, పాపక్షమాపణయు దయచేయుటకై దేవుడాయననను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలముచేత అనగా కుడిచేతి బలముచేత హెచ్చించియున్నాడు."
మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమైయున్నామని చెప్పిరి.
"వారు ఈ మాటలు విని అత్యాగ్రహము తెచ్చుకొని, హృదయమందు నరకబడినవారై వీరిని చంపనుద్దేశించగా,"
సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోప దేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో నిలిచి - ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను -
"ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్త సుమండు!"
"ఈ దినమునకు మునుపు ధుదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరు మంది మనుష్యులు వానితో కలిసికొనిరి. వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదిరి వ్యర్థులైరి."
వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడ తిరుగుబాటు చేయప్రేరేపించెను. వాడు కూడ నశించెను. వానికి లోబడిన వారందరును చెదరిపోయిరి.
కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా - ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచననైనను ఈ కార్యమైనను మనుష్యుల వలన కలిగినదాయెనా అది వ్యర్థమగును.
దేవుని వలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొక వేళ దేవునితో పోరాడువారగుదురు సుమీ!
వారతని మాటకు సమ్మతించి అపొస్తలులను పిలిపించి - కొట్టించి - యేసు నామమును బట్టి బోధింప కూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడి నందున వారు సంతోషించుచు మహాసభ యెదుట నుండి వెళ్ళిపోయి -
"ప్రతి దినము దేవాలయములోను, యింటింటను మానక బోధించుచు, యేసేక్రీస్తని ప్రకటించుచుచుండిరి."