John 17
"''యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి ఇట్లనెను - తండ్రీ, నా ఘడియ వచ్చియున్నది."
నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్య జీవము అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి.
"అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్యజీవము."
చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.
"తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము."
"లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరచితిని. వారు నీవారైయుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యముగైకొని యున్నారు."
"నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను మీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక"
నీవు నాకు అనుగ్రహించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగియున్నారు.
"నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్రహించి యున్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను."
"నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమ పరచబడియున్నాను."
"నేనికను లోకములో ఉండను, గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధువైన తండ్రీ, మనము ఏకమైయున్నట్లు వారును ఏకమైయుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము."
నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.
ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను.
వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారిను లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.
నీవు లోకములో నుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను.
నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.
సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము; నీ వాక్యమే సత్యము.
నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.
వారును సత్యమందు ప్రతిష్ట చేయబడునట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసికొనుచున్నాను.
"''మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు - తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు;"
వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచు వారందరును ఏకమైయుండవలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
"మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని."
"వారియందు నేనును, నాయందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టె వారిని కూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని."
"తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి."
"నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు."
"నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదనని చెప్పెను.''"