:

John 8

1

యేసు ఒలీవల కొండకు వెళ్లెను.

2

తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను.

3

"శాస్త్రులును పరిసయ్యులును వ్యభిచారమందు పట్టబడిన యొక స్త్రీని తోడుకొనివచ్చి, ఆమెను మధ్య నిలువబెట్టి -"

4

"బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను;"

5

అట్టివారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మన కాజ్ఞాపించెను గదా; అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన నడిగిరి.

6

"ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి, నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను."

7

"వారాయనను పట్టు వదలక అడుగుచుండగా, ఆయన తలయెత్తి చూచి - ''మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును'' అని వారితో చెప్పి,"

8

మరల వంగి నేల మీద వ్రాయుచుండెను.

9

"వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను"

10

"యేసు తలయెత్తి చూచి - ''అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా?'' అని అడిగినప్పుడు,"

11

"ఆమె - లేదు, ప్రభువా అనెను. అందుకు యేసు - ''నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్ళి ఇక పాపము చేయకుము'' అని ఆమెతో చెప్పెను."

12

"మరల యేసు - ''నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు గలిగి యుండును'' అని వారితో చెప్పెను."

13

"కాబట్టి పరిసయ్యులు - నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు; నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా,"

14

యేసు - ''నేను ఎక్కడనుండి వచ్చితినో ఎక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు.

15

మీరు శరీరమునుబట్టి తీర్పు తీర్చుచున్నారు; నేనెవరికిని తీర్పు తీర్చను.

16

"నేను ఒక్కడనైయుండక, నేనును నన్ను పంపిన తండ్రియు కూడ నున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే."

17

మరియు ఇద్దరు మనుష్యుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడియున్నది గదా?

18

నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనువాడను; నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు'' అని చెప్పెను.

19

"వారు - నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా, యేసు - ''మీరు నన్ష్నెనను నా తండ్రినైనను ఎరుగరు; నన్ను ఎరిగి యుంటిరా నా తండ్రిని కూడ ఎరిగియుందురు'' అని వారితో చెప్పెను."

20

"ఆయన దేవాలయములో బోధించుచుండగా, కానుక పెట్టె యున్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు."

21

మరియొకప్పుడు ఆయన - ''నేను వెళ్ళి పోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.

22

అందుకు యూదులు - నేను వెళ్లుచోటికి మీరు రాలేరు'' అని ఈయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపుకొనునా? అని చెప్పుకొనుచుండిరి.

23

"అప్పుడాయన - ''మీరు క్రిందివారు, నేను పైనుండువాడను; మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను"

24

కాగా మీ పాపములలోనే యుండి మీరు చనిపోవుదురని మీతో చెప్పితిని. నేను ఆయననని మీరు విశ్వసించన యెడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురు'' అని వారితో చెప్పెను.

25

కాబట్టి వారు - నీవెవరవని ఆయన నడుగగా యేసు వారితో - ''మొదటనుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడినే.

26

"మిమ్మును గూర్చి చెప్పుటకును, తీర్చు తీర్చుటకును చాల సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను'' అని చెప్పెను."

27

తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి.

28

"కావున యేసు - ''మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమియుచేయక, తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నాననియు మీరు గ్రహించెదరు."

29

నన్ను పంపినవాడు నాకు తోడైయున్నాడు; ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు'' అని చెప్పెను.

30

ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకు లాయనయందు విశ్వసముంచిరి.

31

"కాబట్టి యేసు, తనను నమ్మిన యూదులతో - ''మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు;"

32

"అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును'' అని చెప్పగా,"

33

"వారు- మేము అబ్రాహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికిని దాసులమై యుండలేదే; మీరు స్వతంత్రులుగా చేయ బడుదురని ఏల చెప్పుచున్నావని ఆయనతో అనిరి."

34

అందుకు యేసు - ''పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

35

దాసుడు ఎల్లప్పుడును ఇంటిలో నివాసము చేయడు; కుమారుడెల్లప్పుడును నివాసము చేయును.

36

కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు.

37

"మీరు అబ్రాహాము సంతానమని నాకు తెలియును; అయినను మీలో నా వాక్యమునకు చోటులేదు, గనుక నన్ను చంపవెదుకుచున్నారు."

38

నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినినవాటినే జరిగించుచున్నారు'' అని వారితో చెప్పెను.

39

అందుకు వారు ఆయనతో - మా తండ్రి అబ్రాహామనిరి; యేసు - ''మీరు అబ్రాహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు.

40

దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారే; అబ్రాహాము అట్లు చేయలేదు.

41

"మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు'' అని వారితో చెప్పెను; అందుకు వారు - మేము వ్యభిచారము వలన పుట్టినవారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా,"

42

"యేసు వారితో ఇట్లనెను - ''దేవుడు మీ తండ్రియైన యెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవునియొద్ద నుండి బయలుదేరి వచ్చియున్నాను; నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను."

43

మీరేల నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విన నేరకుండుట వలననేగదా?

44

"మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడైయుండి సత్యమందు నిలిచినవాడు కాడు; వాని యందు సత్యమేలేదు; వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును; వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై యున్నాడు."

45

నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.

46

నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు?

47

దేవుని సంబంధియైనవాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరు'' అని చెప్పెను.

48

"అందుకు యూదులు - నీవు సమరయుడవును దయ్యముపట్టిన వాడవును అని మేము చెప్పుమాట సరియేగదా? అని ఆయనతో చెప్పగా,"

49

"యేసు - ''నేను దయ్యముపట్టినవాడను కాను, నా తండ్రిని ఘనపరచువాడను; మీరు నన్ను అవమానపరుచుచున్నారు."

50

నేను నా మహిమను వెదకుటలేదు; వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు.

51

ఒకడు నా మాట గైకొనినయెడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అని ఉత్తరమిచ్చెను.

52

అందుకు యూదులు - నీవు దయ్యము పట్టినవాడవని ఇప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను - ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచిచూడని నీవు చెప్పుచున్నావు

53

మన తండ్రియైన అబ్రాహాము చనిపోయెను గదా? నీవతనికంటె గొప్పవాడవా? ప్రవక్తలును చనిపోయిరి; నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయన నడిగిరి.

54

అందుకు యేసు - ''నన్ను నేనే మహిమపరచు కొనినయెడల నా మహిమ వట్టిది - మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమ పరచుచున్నాడు.

55

"మీరు ఆయనను ఎరుగరు, నేనాయను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనై యుందును గాని నేనాయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను."

56

మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను'' అనెను.

57

"అందుకు యూదులు - నీకింకను ఏబది సంవత్సరములైనా లేవే, నీవు అబ్రాహామును చూచితివా? అని ఆయనతో చెప్పగా,"

58

యేసు - ''అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను'' అనెను

59

కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములోనుండి బయటికి వెళ్ళిపోయెను.

Link: