:

Matthew 4

1

అప్పుడు యేసు అపవాది (సాతాను) చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను.

2

నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా

3

ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి - ''నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము'' అనెను.

4

అందుకాయన - ''మనుష్యుడు రొట్టె వలనను మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును'' (ద్వితీయోపదేశ 8:3) అని వ్రాయబడి యున్నదనెను.

5

అంతట అపవాది (సాతాను) పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి

6

"- నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ''ఆయన నిన్ను గూర్చి తన దూతల కాజ్ఞాపించును, నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు'' (కీర్తన 91:11-12) అని వ్రాయబడి యున్నదని ఆయనతో చెప్పెను."

7

అందుకు యేసు ''ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు అని (ద్వితీయోపదేశ 6:16) మరియొక చోట వ్రాయబడి యున్నది'' అని వానితో చెప్పెను.

8

"మరల అపవాది మిక్కిలి ఎత్ష్తెన యొక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటిని, వాటి మహిమను ఆయనకు చూపి-"

9

"''నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసినయెడల వీటిన్నటిని నీకిచ్చెదను'' అని ఆయనతో చెప్పగా,"

10

"యేసు వానితో-''సాతానా, పొమ్ము- ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను'' (ద్వితీయోపదేశ6:13) అని వ్రాయబడియున్నది'' అనెను."

11

"అంతట అపవాది ఆయనను విడిచిపోగా, దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. గలిలయలో యేసు బోధలు ప్రారంభించుట (మార్కు1:14-15; లూకా4:14-15)"

12

"యోహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి,"

13

నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి యను దేశముల ప్రాంతములలో సముద్రతీరమందలి కపెర్నహూమునకు వచ్చి నివాసముండెను.

14

''జబూలోను దేశమును నఫ్తాలి దేశమును యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలును గొప్ప వెలుగును చూచిరి.

15

మరణ ప్రదేశములోను మరణచ్ఛాయలోను కూర్చున్నవారికి వెలుగు ఉదయించెను'' (యెషయా9:12).

16

అని ప్రవక్తయైన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను.

17

అప్పటి నుండి యేసు - ''పరలోక రాజ్యము సమీపించి యున్నది గనుక మారుమనస్సు పొందుడి'' అని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను.

18

"యేసు గలిలయ సముద్ర తీరమున నడచుచుండగా-పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు."

19

"ఆయన - ''నా వెంబడి రండి"","

20

నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతును'' అని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

21

ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరిఇద్దరు సహోదరులు తమ తండ్రియైన జెబెదయి యొద్ద దోనెలో తమ వలలు బాగు చేసుకొను చుండగా చూచి వారిని పిలిచెను.

22

వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

23

"యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలలియ యందంతట సంచరించెను."

24

"ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించెను. నానా విధములైన రోగములచేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరిని, దయ్యము పట్టినవారిని, చాంద్రరోగులను, పక్షవాయువు గలవారిని వారిని ఆయన యొద్దకు తీసికొని రాగా ఆయన వారిని స్వస్థపరచెను."

25

"గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండియు, యొర్దానునకు అవతలి నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను."

Link: