Revelation 19
అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని - ప్రభువును స్తుతించుడి; రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును.
ఆయన తీర్పులు సత్యములును న్యాయములునైయున్నవి; తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారు - ప్రభువును స్తుతించుడి అనిరి.
ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.
"అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలును, నాలుగు జీవులును సాగిలపడి - ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహస నాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి."
"మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారలారా, కొద్దివారేమి గొప్ప వారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్నయొక స్వరము సింహాసనము యొద్దనుండి వచ్చెను."
"అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరము - సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది."
ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచు కొన్నది; గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని.
మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమె కియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను - గొఱ్ఱెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థ్ధమైన మాటలని నాతో చెప్పెను.
"అందుకు నేను దేవునికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపగా, అతడు - వద్దు సుమీ, నేను నీతోను యేసుని గూర్చి సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుము. యేసుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను."
మరియు పరలోకము తెరువబడుట చూచితిని. అప్పుడిదిగో తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండి యున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శచేయుచు యుద్ధము జరిగించుచున్నాడు.
"ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికిని తెలియదు;"
రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి యున్నది.
పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱములెక్కి ఆయనను వెంబడించుచుండిరి.
"జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది, ఆయన ఇనుప దండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును."
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడియున్నది.
మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని.
"అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి - రండి, రాజుల మాంసమును సహస్రాధి పతుల మాంసమును బలిష్టుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రుల దేమి దాసులదేమి కొద్దివారి దేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు కూడి రండని ఆకాశమధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను."
మరియు ఆ గుఱ్ఱము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.
అప్పుడు మృగమును దాని యెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి.
కడమ వారు గుర్రము మీద కూరున్నవాని నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.