"ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోక మందు ఒక తలుపు తెరువబడియుండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు- ఇక్కడికి ఎక్కిరమ్ము; ఇక మీదట జరుగవలసిన వాటిని నీకు కనుపరచెదననెను."
2
"వెంటనే నేను ఆత్మ వశుడనైతిని, అదిగో పరలోక మందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై యుండెను,"
"సింహాసనము చుట్టు ఇరువది నాలుగు సింహాసనములుండెను, ఈ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని, తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకొన్నవారై కూర్చుండిరి."
5
ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలు దేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి; అవి దేవుని ఏడు ఆత్మలు.
6
"మరియు ఆ సింహాసనము ఎదుట స్పటికమును పోలిన గాజువంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టును, ముందు వెనుక కన్నులతో నిండిన నాలుగు జీవులుండెను."
7
మొదటి జీవి సింహము వంటిది; రెండవ జీవి దూడవంటిది; మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది; నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజువంటిది.
8
"ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి-భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్లు చెప్పు చుండును."
9
"ఆ సింహాసనమునందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞాతాస్తుతులును కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా,"
10
ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనము నందు ఆసీనుడైయుండువాని యెదుట సాగిలపడి- యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు-
11
"ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి యుండెను; దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి."