Acts 12
"దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని,"
యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.
ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు.
"అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండుగైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను."
"పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను."
"హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావలెనని యుండగా ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్ళతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను, మరియు కావలివారు తలుపు యెదుట చెరసాల కాచుకొనుచుండిరి."
ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి - త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతులనుండి ఊడిపెను.
"అప్పుడు దూత అతనితో నీవు నడుముకట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతలాగు చేసిన తరువాత, దూత - నీ వస్త్రముపైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను."
"అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినదని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను."
మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను.
"పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతినుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటిన్నిటి నుండియు నన్ను తప్పించియున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను."
ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరుగల యోహాను తల్లియైన మరియు యింటికి వచ్చెను; అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి.
అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రొదేడె అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.
ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషముచేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.
"అందుకు వారు - నీవు పిచ్చిదానవనిరి. అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు, వారు - అతని దూత అనిరి."
పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపుతీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.
"అతడు - ఊరకుండుడని వారికి చేసైగ చేసి, ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఏలాగు తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులను తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను."
తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంతంత కాదు.
హేరోదు అతని కోసము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయనుండి కైసరయకు వెళ్ళి అక్కడ నివసించెను.
"తూరీయులు మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్త యగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకొని సమాధానపడవలెనని వేడుకొనిరి. ఎందుకనగా, రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను."
నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసము చేయగా;
జనులు - ఇది దైవస్వరమే కాని మానవస్వరము కాదని కేకలు వేసిరి.
అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.
"బర్నబాయు, పౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి."