Acts 14
"ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థులును విశ్వసించిరి."
అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి.
కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను.
"ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షము గాను, కొందరు అపొస్తలుల పక్షముగా నుండిరి."
"మరియు అన్యజనులను యూదులును తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి, రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి."
వారా సంగతి తెలిసికొని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.
లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను.
అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.
"అతడు పౌలు మాట లాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థతపొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి,"
"నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు, అతడు గంతులు వేసి నడువసాగెను."
"జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి, లుకయోనియ భాషలో - దేవతలు మనుష్యరూపము దాల్చి మనయొద్దకు దిగి వచ్చియున్నారని కేకలు వేసి,"
"బర్నబాకు ద్యుపతి అనగా బృహస్పతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగియైనందున అతనికి హెర్మేయనియు పేర్లు పెట్టిరి."
పట్టణమునకు ఎదురుగానున్న ద్యుపతియొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసికొని వచ్చి సమూహముతో కలిపి బలి అర్పింపవలెనని యుండెను.
"అపొస్తలులైన బర్నబాయు, పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి-"
"అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల మనుష్యులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో నుండు సమస్తమును సృజించిన జీవముగల దేవుని వైపు తిరుగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము."
ఆయన గత కాలములలో సమస్త జనులను తమతమ మార్గములయందు నడువనిచ్చెను.
"అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతమైన రుతువులను దయచేయుచు ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి."
వారీలాగు చెప్పి తమకు బలి అర్పించకుండ సమూహముల ఆపుచేయుట బహు ప్రయాసమాయెను.
"అంతి యొకయనుండియు ఈకొనియనుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణపు వెలుపలికి అతనిని ఈడ్చిరి."
"అయితే శిష్యులు అతని చుట్టు నిలిచి యుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, మరునాడు బర్నబాతో కూడ దెర్బేకు బయలుదేరి పోయెను."
"వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత, లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి,"
"శిష్యుల మనస్సులను దృఢపరచి, మనము విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి."
"మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి."
తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంపూలియకు వచ్చిరి.
"మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్ళిరి."
అక్కడనుండి ఓడ యెక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చిరి.
"వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు వివరించిరి."
పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపిరి.